లోక్ సభ, అసెంబ్లీ ఇంఛార్జిల మార్పులపై జాబితాను ప్రకటించిన వైసీపీ
అమరావతి: రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ,, పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో వుంచుకుని వైసీపీ అదిష్టానం అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది..వైసీపీ ఇప్పటి వరకు 4 జాబితాలను విడుదల చేసింది..తాజాగా బుధవారం 5వ జాబితా విడుదల చేసింది..తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, లోక్ సభ, అసెంబ్లీ ఇంఛార్జిల మార్పులపై జాబితాను ప్రకటించారు..ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్రకార్యదర్శి, ముఖ్యమంత్రి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు..4 MP స్థానాలకు,,3 MLA నియోజకవర్గాలకు ఇన్ఛార్జిలను మారుస్తూ వారి పేర్లను, నియోజకవర్గాలను ప్రకటించారు.