స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ,ఇండిపెండెట్ అభ్యర్ది
తూర్పు రాయలసీమఅభ్యర్దులుగా నామినేషన్స్..
నెల్లూరు: ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి బుధవారం 4 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి..ysrcp అభ్యర్థిగా మేరిగ మురళీధర్ మూడు సెట్ల నామినేషన్ పత్రాలను కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి రోణంకి కూర్మనాథ్ కు అందజేశారు.. అలాగే పెళ్లకూరు మండలం బంగారంపేట సర్పంచ్ దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు..ఈనెల 23 (గురువారంతో) నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది.
చిత్తూరు కలెక్టరేట్ లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల అభ్యర్దిగా,పేర్నిటి,శ్యాంప్రసాద్ రెడ్డి,,ఉపాద్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతరెడ్డి.చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.