AMARAVATHINATIONAL

మిజోరం వద్ద నిర్మాణంలో వున్న రైల్వే వంతెన కూలి 17 మంది మృతి

అమరావతి: మిజోరంలోని ఐజ్వాల్కు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయిరాంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన అకస్మాత్తుగా కూలిపోవడంతో 17 మంది కార్మికులు మరణించారు.. చాలామంది వంతెన శిథిలాల క్రింద చిక్కుకుపోయినట్లు ఆందోళన వ్యక్తం అవుతోంది..ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినపుడు 35 నుంచి 40 మంది కార్మికులు పనిలో ఉన్నట్లు సమాచారం వుందని,,శిథిలాల నుంచి 17 మృతదేహాలను వెలికితీశామని,,ఇంకా చాలామంది ఆచూకీ తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు..ఈ దుర్ఘటనపై మిజోరం సీఎం జోరంతంగ స్పందిస్తూ,,మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు..
ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..మరణించిన వారిక కుటుంబాలకు ప్రధాన మంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు..క్షతగాత్రులకు రూ.50,000 లు అందజేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది..

రైల్వేశాఖ మంత్రి ఆశ్వనీ వైష్ణవ్ స్పందిస్తు,,ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం బాధకరమన్నారు..మరణించిన వారి కుటుంబాలకు రైల్వేశాఖ నుంచి రూ.10 లక్షలు,,గాయపడిన వారికి రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించారు..కూలిన వంతెన వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *