విశాఖపట్నంలో ఈనెల 10వ తేది నుంచి 19 వరకు 3వ విడత వారాహి విజయ యాత్ర
అమరావతి: “ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగిందని,,అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల.మనోహర్ అన్నారు..యాత్ర విజయవంతంపై విశాఖ నాయకులతో సన్నాహక సమావేశం జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖపట్నం నగరం నుంచి మొదలవుతుందని,, ఈ యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో మనోహర్ సన్నాహక సమావేశం నిర్వహించారు..గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని కోరారు..యాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమం విశాఖలో ఉంటుందని,,అదే విధంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో పవన్ కళ్యాణ్ సమావేశమై సమస్యలను తెలుసుకుంటారని వెల్లడించారు.
సమావేశంలో సంభాషణ:- ఈ నెల 10వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత ప్రారంభం విశాఖపట్నం నగరంలో ఈ యాత్ర మొదలవుతుంది..అదే రోజు విశాఖపట్నంలో వారాహి వాహనం నుంచి సభ నిర్వహిస్తారు..19వ తేదీ వరకూ ఈ యాత్ర ఉంటుంది..ఈ యాత్రలో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు, విశాఖలో చోటు చేసుకొంటున్న భూకబ్జాలకు సంబంధించిన పరిశీలనలు ఉంటాయి..పర్యావరణాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు.. యాత్ర నిర్వహణలో జాగరూకతతో ఉండాలని సూచించారు.