AMARAVATHINATIONAL

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాలను నిలిపివేయాండి-ఎన్జీటీ

రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..
అమరావతి: ఎన్జీటీలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది..ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటి తీర్పు ఇచ్చింది.. నాగేంద్రకుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై ఎన్జీటీ ఈ తీర్పు ఇచ్చింది.. ఆంధ్రప్రదేశ్ లో 110 రీచ్ లలో ఇసుక తవ్వకాలు పూర్తిగా నిలిపివేయాలని,, తాజాగా పర్యావరణ అనుమతులు తీసుకునేంతవరకూ ఇసుక తవ్వకాలు చేపట్టరాదన్న స్పష్టమైన అదేశాలు ఇచ్చింది..రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ(సియా) 110 రీచ్ లలో ఇసుక తవ్వకాలను నిలిపేయాలని ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలంటూ ఎన్డీటీ స్పష్టం చేసింది.. సుప్రీంకోర్టు కూడా ఇసుక తవ్వకాలను నిలిపివేసి, తాజాగా పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రారంభించాలని చెప్పిన విషయాన్ని కూడా తన తీర్పులో ఎన్జీటీ పేర్కొంది.. గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులు అరణియార్ నదిలో ఉన్న 18 రీచ్ లకు మాత్రమే పరిమితం కాదని,,తాము ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోక పోవడమే కాకుండా ట్రిబ్యునల్ తీర్పుకు వక్రబాష్యం చెప్పిందని ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. సియా స్టాప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత జరిగిన ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటి ఆదేశాలు జారీ చేసింది..ఇసుక తవ్వకాలపై జెపి వెంచర్స్ కూడా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశాలల్లో పేర్కొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *