టన్నెల్ నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన 41 మంది కార్మికులు
అమరావతి: 17 రోజుల నుంచి ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ లో చిక్కుకున్న 41 మంది కూలీలను సురక్షితంగా రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది..కార్మికులను రక్షించేందుకు ఎలుక మైనర్ల బృందం మాన్యువల్ డ్రిల్లింగ్ పూర్తి చేసింది.. సంఘటనా స్థలానికి NDFR,,SDRF బృందాలు చేరుకున్నాయి.. కూలీలను త్వరగా ఆస్పత్రికి తరలించేందుకు గ్రీన్ కారిడార్ పనులు పూర్తి చేశారు..కార్మికులు బయటకు వచ్చిన వెంటనే ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు..సొరంగం నుంచి బయటకు వచ్చే కార్మికులందరినీ చిన్యాలి సౌద్ లోని యూనిటీ హెల్త్ సెంటర్ తరలించారు..ఇక్కడ ప్రతి ఒక్కరికీ ఒక మంచం కేటాయించారు.. ప్రతి ఒక్కరికీ మానిటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్ల ఏర్పాట్లు చేశారు..ఆసుపత్రిలో మందులు, ఇంజక్షన్ల కొరత లేకుండా చూసేందుకు మొత్తం స్టాక్ ను ఇక్కడ అందుబాటులో ఉంచారు.. ఈ మొత్తం ఆపరేషన్ ను కేంద్ర మంత్రి జనరల్ VK సింగ్, PMO మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే, మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్, BRO DG లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ లు సిల్క్యారా సొరంగం దగ్గరుండి పర్యవేక్షించారు..
వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు:- ఉత్తరాఖండ్-2,,హిమాచల్ ప్రదేశ్-1,,ఉత్తరప్రదేశ్-8,,బీహార్-5,,పశ్చిమ బెంగాల్-3,, అస్సాం-2,, జార్ఖండ్-15,, ఒడిశా-5 ఉన్నారు.
विजयी भवः श्रमवीरों।#UttarakhandTunnelRescue pic.twitter.com/kXGAgSdjqY
— Sambit Patra (@sambitswaraj) November 28, 2023