ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పిటీషిన్ విచారణ 3 వారాలు వాయిదా
అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది..గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్కు ఈ కేసును ట్యాగ్ చేసిన సుప్రీంకోర్టు,,కేసు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది..మహిళలను ED ఆఫీస్కు పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళినీ పిటిషన్ దాఖలు చేశారు.. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, విక్రమ్ చౌధురి కవిత తరఫున వాదనలు వినిపించిగా,, ED తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు..