AMARAVATHICRIME

బాంబులతో దాడి చేసి బీజెపీ నేత దారుణ హాత్య

అమరావతి: తమిళనాడులో భారతీయజనతా పార్టీ రోజు రోజుకు పుంజుకుంటున్న నేపధ్యంలో క్రీయశీలకంగా వ్యవహరిస్తున్న నాయకులను,కిరాతకపు మూకలు కడతేర్చుతున్నాయి..ఈ నేపధ్యంలో పుదుచ్చేరిలోని విలియనూర్ లో సీనియర్ బీజేపీ లీడర్ రంగస్వామి కుమారుడు సెంథిల్ కుమార్ (46)ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హాత్య చేశారు..మంగళం నియోజక వర్గంలో ఆదివారం రాత్రి జరిగిన బీజేపీ సమావేశంలో పాల్గొన్న సెంథిల్ కుమార్  విలియనూర్ కణ్ణగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని ఓ బేకరీ షాపు వద్ద టీ త్రాగేందుకు అగాడు.. సెంథిల్ కుమార్ ను అనుసరిస్తున్నట్లుగా అనుమానిస్తున్న 9 మంది  గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి 3 మోటర్ సైకిళ్లపై వచ్చి మొదట అతనిపై బాంబులతో దాడి చేశారు..దింతో కంగారు పడి పరిగెత్తిన సెంథిల్ పై మరోసారి బాంబు విసిరారు..రెండవ బాంబు దాడికి గాయాలై కిందపడ్డ సెంథిల్ ను చుట్టుముట్టి,,కత్తులతో అతి కిరాతకంగా దాడి చేసి చంపేశారు..దాడి చేసిన ముఠా సభ్యులు వెంటనే బైక్ లపై అక్కడినుంచి పారిపోయారు.. హత్య సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వం హాస్పిటల్ కి తరలించారు..సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు,,హంతకులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృదాల్లా ఏర్పాటై దర్యాప్తు చేస్తున్నారు.. బేకరీ షాపులో ఉన్న సీసీ  కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *