కృష్ణపట్నం పోర్టుకు అనుసంధాన రహదారుల భూసేకరణ వేగవంతం చేయాలి-కలెక్టర్
నెల్లూరు: జాతీయ రహదారి నుంచి కృష్ణపట్నం పోర్టుకు అనుసంధాన రహదారుల నిర్మాణాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం R&B అతిధి గృహంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ, నేషనల్ హైవే, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశమై జాతీయ రహదారి నుంచి కృష్ణపట్నం పోర్టుకు అనుసంధాన రహదారుల నిర్మాణాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతి పై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ రహదారి నుంచి కృష్ణపట్నం పోర్టుకు అనుసంధాన రహదారుల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.ఫేజ్ 3 క్రింద చేపట్టిన రహదారుల నిర్మాణాలకు సంబంధించి సేకరించిన భూములను అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వడంలో చాలా ఆలస్యం అవుతోoదని, రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.