ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్-నాలుగురు మావోయిస్టులు మృతి
అమరావతి: మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని రేపన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నాలుగురు మావోయిస్టులు మరణించారు..ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్రం. మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్,, చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మగ్తూ,,ప్లాటూన్ సభ్యులు కుర్సంగ్ రాజు,, కుడిమెట్ట వెంకటేశ్గా గుర్తించారు.. ఘటనా స్థలంలో ఏకే 47,,ఒక కార్బైన్,,రెండు పిస్టల్స్ తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. మృతుల్లో ఇద్దరిపై గతంలో రూ.36 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు..ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు.