గ్రీస్ దేశంలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ
అమరావతి: 40 సంవత్సరాల అనంతరం భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గ్రీస్ దేశంలో పర్యటిస్తున్నారు.. సౌత్ ఆప్రికాలో బ్రిక్స్ సమావేశాల తరువాత నేరుగా శుక్రవారం గ్రీస్ కు చేరుకున్నారు..ప్రధాని మోదీ ఏథెన్స్ లో అడుగుపెట్టగానే గ్రీస్ లోని భారతీయులు హోటల్ వెలుపల ఘనస్వాగతం పలికారు..గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ గ్రీస్ దేశంలో పర్యటిస్తున్నారు..ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన పట్ల గ్రీస్ దేశం ఏథెన్స్ లోని భారతీయులు హర్షం వ్యక్తం చేశారు..గ్రీస్ ప్రధాని కైరియాకోస్ మిత్సోటాకిస్ తో మోదీ సమావేశమై ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేసే మార్గాలపై ఇద్దరు నేతలు చర్చిస్తారు..అలాగే ఇరు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలతోనూ మోదీ సమావేశం కానున్నారు..