పొత్తులపై అధికారిక ప్రకటన చేసిన బీజెపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా
అమరావతి: బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్లు 3 రోజుల పాటు జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలవంతమైయ్యాయి.. తెలుగుదేశం,బీజెపీకి పాత మిత్రపక్షమే..2 రోజుల్లోపు సీట్ల పంపకంపై స్పష్టత వస్తుందని పొత్తులపై బీజేపీ అధికారిక ప్రకటన చేసస్తూ,,NDA కుటుంబంలో చేరాలని చంద్రబాబు నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని బీజెపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా ట్విట్టర్లో పేర్కొన్నారు..దేశ ప్రగతిపై స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్లుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభ్యున్నతి కోసం టీడీపీ-జనసేన- బీజేపీ కలిసి పనిచేస్తాయని నడ్డా వెల్లడించారు..అధికారిక ప్రకటన రావడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు..