AMARAVATHIINTERNATIONAL

పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.272,,డీజిల్ ధర రూ.273

తీవ్ర ఆర్దిక సంక్షోభం..
అమరావతి: పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకొవడంతో ద్రవోల్బణం కారణంగా ధరలు అమాతంగా పెరిగిపోతున్నాయి..మంగళవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ పై 19 రూపాయలు పెంచుతున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్ స్వయంగా వెల్లడించారు..లీటర్ పెట్రోల్ ధరపై 19.95 రూపాయలు, లీటర్ డీజిల్ ధరపై 19.90 రూపాయలు ధరను పాకిస్థాన్ ప్రభుత్వం పెంచింది..ధరల పెంపుతో పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.272.95కి,,లీటర్ డీజిల్ ధర రూ.273.40కు చేరుకుంది.. గత సంవత్సరం పాకిస్థాన్ ను ముంచెత్తిన వరదల కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటలన్నీ నీటమునిగిపోయాయి..క్రమేణ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఇప్పుడు దిగుమతి చేసుకోవాలన్నా తగినంత విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేని పరిస్థితి ఏర్పడింది..నిన్న వరకు రూ.20 ఉండే కిలో గోధుమ పిండి ధర రూ.140 నుంచి రూ.160కి చేరుకుంది..10 కేజిల బస్తాను వ్యాపారులు రూ.1500,, 20 కిలోల బస్తాను రూ.2800 వంతున అమ్ముతున్నారు..
కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు:- LPG Gas 11.8 kg సిలెండర్ ధర రూ.281.5లు పెంచడంతో ప్రస్తుతం ధర రూ.1886.30,, చికెన్ కేజీ రూ.460,,డజను గుడ్లు రూ.300,,బీఫ్ కేజీ రూ.750-850,,కేజీ మటన్ రూ.1500-1800,,కందిపప్పు రూ.295,,పెసరపప్పు రూ.310,,ఉల్లిపాయలు రూ.180-280,,టొమాటో రూ.80-120,,పాలు లీటరు రూ.180-200లకు వ్యాపారస్తులు అమ్ముతున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *