బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి-హోం మంత్రి అమిత్ షా
అమరావతి: బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి పలుకుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం లోక్ సభలో 3 బిల్లులను ప్రవేశపెట్టారు..1860 ఇండియన్ పీనల్ కోడ్(IPC), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(CRPC), ఇండియన్ఎవిడెన్స్ యాక్ట్(IEA) చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొని వచ్చారు..ప్రజలకు “న్యాయం అందించడంపై దృష్టి పెట్టాలి,, శిక్ష విధించడం” ముఖ్యం కాదు అనే లక్ష్యంతో బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టినట్లు అమిత్ షా వెల్లడించారు.. కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత-2023,,భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023,, భారతీయ సాక్ష్యా-2023,,అనే ఈ మూడు బిల్లులు తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ ప్యానెల్ కు పంపినట్లు అమిత్ షా తెలిపారు..ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ,, దేశంలో అమలులో ఉన్న న్యాయ వ్యవస్థ స్వరూపం బ్రిటిష్ వారు చేసిన చట్టాల ప్రకారం పనిచేస్తోంది.. బ్రిటీష్ పరిపాలనా కాలంలో తీసుకొచ్చిన ఈ చట్టాల ముఖ్య ఉద్ధేశ్యం శిక్షించడమే తప్ప న్యాయం చేయడం కాదు..వాటిని సవరిస్తూ మూడు కొత్త చట్టాలు తీసుకువస్తున్నాం..కొత్త బిల్లులు పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి..కొత్త బిల్లుల లక్ష్యం శిక్షించడం కాదు,, న్యాయం చేయడమే..IPC,,CRPC,, ఎవిడెన్స్ యాక్ట్ లు బ్రిటిష్ కాలం నాటి చట్టాలు..వలసవాద పాలనను రక్షించడం,, వారి పాలన బలోపేతం చేయడం,,ప్రజలను శిక్షించడమే లక్ష్యంగా వాటిని ప్రవేశపెట్టారు..బాధితులకు న్యాయం చేయడం సదరు ఉద్దేశం కాదు..కొత్త చట్టాలు నేరాలను అరికట్టాడమే లక్ష్యంగా శిక్షలు విధిస్తాయని’ పేర్కొన్నారు.