పిస్తొలుతో భార్య ఇద్దరు కుమార్తెలను కాల్చి,తాను ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్
కడప: ఆత్మహత్యలు చేసుకునే వారికి మానసిక ఒత్తిడి ఏ స్థాయిలో వుంటుందో ఆర్దం చేసుకోవచ్చ్.. ఇలాంటి సంఘటనే ఒకటి కడప పట్టణంలో బుధవారం ఆర్దరాత్రి చోటు చేసుకుంది..స్థానికులు తెలిపిన వివరాల మేరకు…? కోపరేటివ్ కాలనీలో వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసం వుంటున్నారు..పెద్ద కుమార్తె బి.టెక్ చదువుతుండగా,,రెండవ కుమార్తె 10వ తరగతి చదువుతుంది..వెంకటేశ్వర్తకు రెండవ భార్య వుంది..అమెకు ఒక కుమారుడు వున్నాడు..ఈ విషయమై,,మొదటి భార్యతో తరుచూ గొడవలు జరుగుతూవుండేవి..
పులివేందుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు రెండు సంవత్సరాల నుంచి కడప నగరంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో రైటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.. బుధవారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు రాత్రి 12 గంటల సమయంలో మళ్లీ స్టషన్ కు వెళ్లారు..ఇంటికి వస్తూ పిస్తొలు తీసుకుని వచ్చి,,భార్య,,ఇద్దరు పిల్లలు కాల్చి చంపి,,తాను కూడా పాయింట్ బ్లాంక్ లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆర్దిక,,కుటుంబ పరమైన కారణలతోనే ఈ సంఘటనలక పాల్పపడిటనట్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్లు కడప డీఎస్పీ షరీఫ్ తెలిపారు..వారి ఇంట్లో వెంకటేశ్వర్లు స్టాంపు పేపర్ పై తన మరణానంతరం ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని రకాల బెనిఫిట్స్ తన రెండవ భార్య రమాదేవి చెందేలా చూడాలంటూ కడప ఎష్పీ కోరుతూ సూసైడ్ నోటు రాసినట్లు తెలుస్తొంది..పోస్టుమార్టం అనంతరం అన్ని విషయాలు తెలుస్తాయని,,ప్రస్తుతం కేసు ప్రధమిక దర్యప్తులో వుందని డిస్పీ తెలిపారు.