AMARAVATHIPOLITICS

అక్టోబర్ 1 నుంచి జనసేని నాలుగో విడత వారాహి విజయ యాత్ర

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర నాలుగో విడత అక్టోబర్ 1వ తేది కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి యాత్ర ప్రారంభం కానున్నది..అక్టోబర్ 6వతేదీ వరకు యాత్ర కొనసాగుతుంది..జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు..ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగుతుంది..వారాహి యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులకు సూచించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *