AMARAVATHIDEVOTIONAL

గర్భగుడిలో ‘రామ్ లల్లా’ విగ్రహా ప్రతిష్ఠపాన పూర్తి

అమరావతి: వచ్చే సోమవారం (22వ తేదిన) జరగనున్న ‘ప్రాణప్రతిష్ఠాపన’ కార్యక్రమానికి ముందు దాదాపు 550 ఏళ్ల తరువాత అయోధ్య రామాలయం గర్భగుడిలో ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు..గురువారం వేకువజామున ప్రత్యేక క్రేన్స్ ద్వారా విగ్రహాన్ని వేద మంత్రోచ్చారణ,, జై శ్రీరామ్ నినాదాల మధ్య గర్భగుడిలోకి తరలించి,,అనంతరం ప్రతిష్టించారు..ఈ కార్యక్రమం వేద పండితుల మంత్రాలు,,శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర టస్టు సభ్యులు సమక్షంలో వైభవోపేతంగా జరిగింది..మైసూరుకు చెందిన శిల్పకళాకారుడు అరుణ్ యోగిరాజ్ మలిచిన 51 అంగుళాల ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని గుర్భగుడిలో ఉంచారు..

7 రోజుల పాటు ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా గురువారం కలశపూజ నిర్వహించారు..సాయంత్రం జలధివాస్ కార్యక్రమంలో భాగంగా విగ్రహానికి జలాభిషేకం నిర్వహిస్తారు..గణేశాంబిక పూజ,,వరుణపూజ,, చతుర్వేదొక్త పుణ్యవచనం,,మండప ప్రవేశం,,పృథ్వి-కుర్మ-అనంత-వరాహ-యజ్ఞభూమి పూజలు జరగనున్నాయి..

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *