AMARAVATHIDEVOTIONAL

నకిలీ ఆధార్ కార్డులతో భక్తుల్ని శ్రీవారి దర్శనానికి-పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ షేక్ షాబ్జి

తిరుపతి: నకిలీ ఆధార్ కార్డులతో భక్తుల్ని శ్రీవారి దర్శనానికి పంపిస్తు వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఎమ్మెల్సీ షేక్ షాబ్జిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.2021లో  ఏలూరు టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచిన షేక్ షాబ్జి నెల రోజుల వ్యవధిలో షాబ్జి 19 మందికి సిఫారసు లేఖలు పంపించారని టీటీడీ విజిలెన్స్ విజిఓ గిరిధర్ రావు తెలిపారు..శ్రీవారి దర్శనం కోసం ఆరుగురు భక్తుల నుంచి రూ.1.05 లక్షలు తీసుకున్నారని పేర్కొన్నారు..

ఎమ్మెల్సీ షేక్ షాబ్జి తరచు శ్రీవారి దర్శనానికి వస్తుండటాన్ని గుర్తించిన టీటీడీ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు..దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ తనిఖీలు నిర్వహించింది..షాబ్జి నకిలీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళుతున్నట్లు గుర్తించారు..భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు,,ఆ డబ్బులను ఎమ్మెల్సీ డ్రైవర్ రాజా ఖాతాకు పంపిస్తున్నట్లు గుర్తించారు..ఎమ్మెల్సీ షేక్ షాబ్జి,నెల రోజుల వ్యవధిలో 19 మంది సిఫార్స్ లేఖలు జారీ చేసారు..ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు షాబ్జి ఇలా సిఫారసులు చేస్తు డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా సమాచారం..ఎమ్మెల్సీ షేక్ షాబ్జిపై తిరుపతి 1వ పట్టణ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది..వీరిద్దరిని టీటీడీ అధికారులు పోలీసులకు అప్పగించమని,,లేఖలపై దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్ విజిఓ గిరిధర్ రావు తెలిపారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *