టీటీడీకి విదేశీ కరెన్సీ విషయంలో మినహయింపు ఇచ్చిన ఆర్బీఐ
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంకి ఆర్బీఐ చల్లటీ కబురు చెప్పింది..తిరుమల శ్రీవారికి విదేశీ భక్తులు సమర్పించే కరెన్సీని బ్యాంక్ ల్లో డిపాజిట్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది..ఫారెన్ కరెన్సి సమర్పించిన దాతలు వివరాలు లేకపోయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు టీటీడీకి మినహయింపునిచ్చింది..భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలుగా వాటిని పేర్కొనాలని,,సెక్షన్ 50 ప్రకారం టీటీడీకి మాత్రమే ఈ అనుమతిస్తున్నట్లు టీటీడీ ఈవోకు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముత్తుకుమార్ సమాచారం ఇచ్చారు.. ఆర్బీఐ, గతంలో విదేశీ కరెన్సీ డిపాజిట్లు వ్యవహరంలో టీటీడీకి 3 కోట్ల జరిమాన విధించింది..భక్తులు హుండీలో వేసిన విదేశీ కరెన్సీ విషయంలో ది ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్( FCRA) నిబంధనలు ఉల్లింఘించినందుకు ఫైన్ విధించింది.. టీటీడీ జరిమాన చెల్లించిన అనంతరం విదేశీ కరెన్సీ డిపాజిట్లు చేసుకునేందుకు లైసెన్స్ రెన్యూవల్ చేసింది ఆర్బీఐ.