తిరుమలలో శుక్రవారం వడగండ్ల వాన
తిరుపతి: తిరుమలలో శుక్రవారం వడగండ్ల వాన కురిసింది..ఉదయం నుంచి మద్యాహ్నం వరకు ఎండ వేడి దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న భక్తులకు మద్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వాడగండ్లవాన రూపంలో ఉఫశమనం కలిగింది..ఉరుములు మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వర్షం కురువడంతో శ్రీవారి దర్శనానికి వెళ్లె భక్తులతో పాటు దర్శనానంతరం ఆలయం వెలుపలికి చేరుకున్నభక్తులు కొద్దిగా ఇబ్బందులు పడ్డారు..వర్షం కారణంగా షాపింగ్ కాంప్లెక్స్,, లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు చేరింది..వర్షం కారణంగా మొదటి,,రెండవ ఘాట్ రోడ్లలో అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని, దీంతో ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని టీటీడీ భద్రతా సిబ్బంది సూచనలు చేశారు.