రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ కు నోటీసులు ఇచ్చిన ఈడీ
ప్రణవ్ జ్యువెలర్స్ ఫోంజీ స్కాం…
అమరావతి: ప్రణవ్ జ్యువెలర్స్ కు సంబంధించిన రూ.100 కోట్ల రూపాయిల మనీలాండరింగ్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ జారీ చేసింది..తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన ప్రణవ్ జువెలర్స్ సంస్థకి ప్రకాష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు..ఈ కేసులో 100 కోట్ల స్కామ్ జరగడంతో ప్రకాష్ ను విచారించాల్సి ఉందని,, అందుకే నోటీసులు ఇస్తున్నట్లు ఈడీ పేర్కొంది..సంస్థ తరపును ప్రకటనకు గాను నటుడు ప్రకాష్ కు సంస్థ పెద్ద మొత్తంలో ముట్టజెప్పిందని ప్రచారం జరుగుతోంది..
పోంజీ స్కీమ్ ద్వారా రూ.100 కోట్ల మోసం :- ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థ వినియోగదారులకు అధిక లాభాలు చూపి,, పోంజీ స్కీమ్ ద్వారా రూ.100 కోట్లు వసూలు చేసి,, అనంతరం ప్రణవ్ జ్యువెలర్స్ బోర్డు తిప్పేసింది.. వినియోగదారుల ఫిర్యాదుతో సంస్థ యజామాని మదన్ పై పలు కేసులు నమోదయ్యాయి..ఇదే సమయంలో అతనిపై కేంద్ర సంస్ధలు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాయి..ఈ కేసులో చెన్నై, పుదుచ్చేరిలోని సంస్థలకు సంబంధించిన బ్రాంచ్ లు, యజమానులపై నవంబర్ 20వ తేదిన ఈడీ అధికారులు సోదాలు చేశారు..ఈ నేధ్యంలో ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థ, లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, పలు బంగారు ఆభరణాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది..అలాగే రూ.100 కోట్ల మేర మోసం జరిగిందని ఈడీ అధికారులు గుర్తించారు..ఈడీ సోదాల తరువాత మదన్ అజ్ఞాతంలో వున్నాడు..ప్రకాష్ రాజ్ విచారణకు ఎప్పుడు వెళ్తారు..? విచారణలో ఆయన ఏం చెప్పబోతున్నారనే అనే విషయంపై సినిమా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.