AMARAVATHIDISTRICTS

భారత రాజ్యాంగ విశిష్టతను ప్రతి పౌరుడు తెలుసుకోవాలి-జె.సి

నెల్లూరు: భారతదేశం ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విలసిల్లుతుంది అంటే దానికి కారణం భారత రాజ్యాంగమేనని,  భారతదేశ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో జీవించడానికి రాజ్యాంగం పీఠికలో పేర్కొన్న అంశాలే ప్రధాన కారణమని జాయింట్ కలెక్టర్ ఆర్. కూర్మనాథ్ పేర్కొన్నారు. ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జె.సి రాజ్యాంగ దినోత్సవ ప్రాధాన్యతను వివరించి, అధికారులతో రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు.  ఈ సంధర్భంగా అయన మాట్లాడుతూ, ఈ రోజు భారత రాజ్యాంగాన్నిఆమోదించుకున్నరోజని,  2015 నుంచి  ప్రతి సంవత్సరం  నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రభుత్వం తీర్మానిస్తూ గజిట్ రూపంలో ప్రచురించడం జరిగిందన్నారు.. అప్పటి నుంచి నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు. భారత రాజ్యాంగ విశిష్టతను ఒక సారి మనం చూసుకున్నట్లయితే   ప్రపంచ రాజ్యాంగాల్లోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమన్నారు. మన రాజ్యాంగంలో పొందుపర్చబడిన అంశాల ఆధారంగా రాజ్యాంగ పరంగా మనమంతా స్వేచ్చాయుత వాతావరణంలో ప్రశాంతంగా జీవిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం అవసరం అన్నారు..అలాగే ప్రజలకు కూడా రాజ్యాంగం యొక్క విలువలు,  రాజ్యాంగం యొక్క ఔనత్యాన్ని తెలియ జేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.ఓ.షఫీ మాలిక్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *