మధురై రైల్వే స్టేషన్ యార్డ్ లో అగివున్న రైలు బోగీలో అగ్ని ప్రమాదం,ఆరుగురు మృతి
అమరావతి: మధురై రైల్వే స్టేషన్ యార్డ్ లో అగివున్న రైలు బోగీల్లో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది..మదురై రైల్వే స్టేషన్ కు సమీపంలో ఆధ్యాత్మిక పర్యాటక రైలు బోగీల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 6 మంది మరణించారని ప్రథమిక సమాచారం..రైలు బోగీల్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలినట్లు తెలుస్తొంది.. లక్నో నుంచి రామేశ్వరంకు 15 రోజుల పర్యటన కోసం లక్నో నుంచి బయలుదేరిన రైలు మధురై రైల్వే స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది..రైలులో మంటలు చెలరేగి కాలిపోవడంతో 20 మందికి పైగా కాలిన గాయాలైనట్లు రైల్వే అధికారులు తెలిపారు..మృతులంతా ఉత్తరప్రదేశ్ వాసులుగా గుర్తించడం జరిగింది..ఉత్తరప్రదేశ్ కు చెందిన సప్తమన్ సింగ్ (64), మిథిలేశ్వరి (65) సహా ఆరుగురు వ్యక్తులు మరణించారని,,మిగిలిన వారి వివరాల కోసం దర్యప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు..గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిచేస్తున్నారు.