AMARAVATHIEDUCATION JOBS

స్కూల్స్ ల్లో మొబైల్స్ వాడకంపై నిషేధం-విద్యాశాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధించింది..స్కూల్స్ కు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకుని రావడంపై పూర్తి నిషేధం విధిస్తూ సోమవారం మెమో జారీ చేసింది..అలాగే  టీచర్లు కూడా తరగతి గదుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విద్యాశాఖ ఆదేశాలను ఉల్లఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్ట చేసింది..ఉపాధ్యాయులు తమ ఫోన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అప్పగించి క్లాస్ రూమ్ లకు వెళ్లాలని సూచనలు చేసింది..టీచింగ్ కు ఆటంకం రాకుండా ఉండేందుకు స్కూల్స్ లో సెల్ ఫోన్లను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు..యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా పాఠశాల విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టింది..నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది.. మధాహ్నం భోజన విరామ సమయంలో, ఇతర విరామ సమయాల్లో మొబైల్ వినియోగించవచ్చని విద్యాశాఖ తెలిపింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పై అధికారులు ఈ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *