మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకుభారతరత్న ప్రకటించిన కేంద్ర
అమరావతి: తెలుగు ముద్దుబిడ్డ అయిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కేంద్రం ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది.. పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్,,దేశానికి హరిత విప్లవంలో మార్గనిర్ధేశ చేసిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా శుక్రవారం భారత రత్న అవార్డును ప్రకటించంది..పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేశారు.. పీవీ ఓ మేధావి,, రాజనీతజ్ఞుడు అని తన ఎక్స్ అకౌంట్లో మోదీ పేర్కొన్నారు..విభిన్న హోదాల్లో నర్సింహారావు పనిచేసినట్లు వెల్లడించారు.. మరో మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటించి తమ ప్రభుత్వం గౌరవించిందన్నారు..అలాగే రైతుల సంక్షేమం కోసం ఎం.ఎస్. స్వామినాథన్ తన జీవితాన్ని అంకితం చేశారన్నారని,,అలాగే అరుదైన శాస్త్రవేత్త కూడా భారతరత్న ప్రకటించడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.