స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించడం సాధ్యం కాదు-సుప్రీమ్
అమరావతి: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించడం సాధ్యం కాదని,,స్వలింగ సంపర్కుల వివాహంపై చట్టం చేసే హక్కు పార్లమెంట్ కే ఉంటుందని సుప్రీం చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది..మంగళవారం సీజేఐ చంద్రచూడ్ తో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహా బెంచ్ లో సభ్యులుగా ఉండగా,,జస్టిస్ హిమా కోహ్లీ మినహా మిగిలిన నలుగురు న్యాయమూర్తులు తీర్పును చదివారు..ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అభిప్రాయాన్ని మార్చుకోవాలని కోరింది..లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని అభిప్రాయపడింది..
కోర్టులు చట్టాలను రూపొందించవని,,ఉన్న చట్టాలనే అర్థం చేసుకుని అమలు చేస్తాయన్నారు..ప్రత్యేక వివాహ చట్టం అవసరమా లేదా అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుందని చెప్పారు..ఇలాంటి బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించింది..వివాహేతర జంటలతో పాటు స్వలింగ జంటలు కూడా బిడ్డలను దత్తత తీసుకోవచ్చని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు..పెళ్లి చేసుకున్న ఆడ-మగ జంట మాత్రమే పిల్లలకు రక్షణ కల్పిస్తారని అనుకోవడం అపోహ మాత్రమే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది..