AMARAVATHIDISTRICTS

ఒక డోర్ నెంబరుపై ఎక్కువమంది ఓటర్లు నమోదు అయిఉంటే- కమిషనర్ వికాస్

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో జనాభాకు తగ్గట్టుగా యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఎన్నికల సిబ్బందికి కమిషనర్ వికాస్ మర్మత్ సూచించారు. ఎన్నికల అధికారులు, సూపర్ వైజర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్ తో కార్పొరేషన్ కార్యాలయంలో రెండు సెషన్లలో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ఓటర్ల జాబితా రూపొందించడంలో B.L.O లు తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఇండ్లను ఇంటింటి సర్వే కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు.
సమావేశానికి హాజరు కాని B.L.Oలకు షో కాజ్ నోటీసులు జారీ చేసి 3 రోజుల్లో వివరణ తీసుకోవాలని ఆదేశించారు.
కార్యాలయానికి పంపించే తొలగింపు జాబితాలో సరియైన రిమార్క్స్ తో పాటు తప్పనిసరిగా సాక్షి సంతకాన్ని కూడా జతపరచాలని సూచించారు. మాన్యువల్ గా సమర్పించే ఫారంలకు తగిన రసీదులను ఓటర్లకు అందించాలని చెప్పారు..చేర్పులు, తొలగింపులకు రాజకీయ పార్టీల B.L.Oలను సమన్వయం చేసుకుని జాబితాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా సరిచూసుకోవాలని కమిషనర్ సూచించారు..ఫారం 6 ద్వారా 18 నుంచి 21 సంవత్సరాల వరకు నమోదు చేయాలని, 21 సంవత్సరాల వయస్సు దాటిన ఓటర్లను నమోదు చేసేందుకు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, మరేదైనా ప్రాంతంలో వారి ఓటు నమోదు ఉందా అని సరి పోల్చుకోవాలని తెలిపారు.
ఒక డోర్ నెంబరుపై ఎక్కువమంది ఓటర్లు నమోదు అయిఉంటే పూర్తి స్థాయిలో విచారించి, సరియైన వివరాలను మాత్రమే నమోదు చేయాలని కమిషనర్ సూచించారు.ఈ సమావేశంలో AEROలు నిర్మలానంద బాబా, దేవీ కుమారి, దశయ్య, ధనుంజయులు, శ్రీనివాసులు,సూపర్ వైజర్లు, బూత్ లెవెల్ అధికారులు, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *