ఓడరేవులు, విమానాశ్రయాలకు భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాండి-సీ.ఎస్
నెల్లూరు: రాష్ట్రంలో చేపట్టిన ఓడరేవులు, విమానాశ్రయాల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ లో వున్న త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, సంబంధిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సి.ఎస్ వర్చువల్ గా అమరావతి నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సమావేశమై రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట (శ్రీకాకుళం జిల్లా) ఓడరేవుల నిర్మాణాలకు సంబంధించి అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి పెండింగ్ లో వున్న భూసేకరణ ప్రక్రియ, నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ పాల్గొని, రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి సంబంధించి చేపడుతున్న భూసేకరణ ప్రక్రియ వివరాలను,పనుల పురోగతిని ప్రధాన కార్యదర్శికి వివరించారు.