ఆంధ్రప్రదేశ్ లో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది-బండి
పవన్ కళ్యాణ్ ప్రజాభిమానం ఉన్న నేత..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందని,,2024 ఎన్నికల్లో వైసీసీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన నెలకొందని,, అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతోందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు..సోమవారం విజయవాడలో జరిగిన ఓటర్ చైతన్య మహాభియాన్’’ కార్యక్రమంలో వర్చువల్ పద్దతి పాల్గొని అయన మాట్లాడుతూ “ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో వైసీపీ నిమగ్నమై వుందని,,అలాంటి అవకతవకలు జరిగినట్లు కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి రావడంతో అనంతపురం జెడ్పీ సీఈవోను సస్పెండ్ చేశారని అన్నారు..మద్యాన్ని నిషేధిస్తామని హామీలిచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా?. అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో ఆంధ్రప్రదేశ్,, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని మండిపడ్డారు..
నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరారని,,పవన్ కళ్యాణ్ ప్రజాభిమానం ఉన్న నేత,, ప్రజా సమస్యలపై జనంలోకి వెళుతుంటే ఆయనను అడ్డుకోవడం దారుణం” అని బండి సంజయ్ మండిపడ్డారు.
ఆంద్రప్రదేశ్లో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని,,టీటీడీ భక్తుల్లో అడగడుగునా భయఆందోళన సృష్టిస్తూ,ఏడుకొండలకు రాకుండా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు..క్రూరమృగాల బారిన పడకుండా భక్తులను కాపాడలేక పోగా చేతి కర్రలిస్తారా? అంటూ విరుచుకు పడ్డారు.. వేంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు..టీటీడీ ఛైర్మన్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిది ఏ మతం ? ఆయన బిడ్డ పెళ్లి క్రైసవ ఆచార పద్దతిలో చేసిన మాట నిజంకాదా?. నేను నాస్తికుడని ఆయన గతంలో చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా? అంటూ ప్రశ్నించారు..