అన్నదాతలకు న్యాయం జరిగే వరకు పోరాడుతా-పవన్ కళ్యాణ్
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో,అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పరిశీలించారు..మీరు వస్తున్నారని ధాన్యం కొనుగోలు వేగవంతం చేశారని రైతులు పవన్ కి తెలిపారు..అన్నదాతలకు న్యాయం జరిగే వరకు పోరాడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు..ఇంకా కోతలు కోయాల్సి వుందని, గోనె సంచులు ఇవ్వడంలేదు గోడు వెళ్లబోసుకున్నారు.. నూక,, ట్రాన్స్ పోర్ట్ పేరుతో రైతులని మిల్లర్లు దొచేస్తున్నరని కౌలు రైతులు కన్నీరు పెట్టుకున్నారు..ఎంత వస్తే అంతకే ధాన్యం అమ్ముకునే పరిస్థితులు వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. రైతులతో మాట్లాడిన పవన్, రైతులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.. అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టంతో పాటు, ధాన్యం కొనుగోళ్లలో ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు.. బుధవారం రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్, రాజమండ్రి నగరం బొమ్మూరు- రాజవోలు మీదుగా రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలోని ఆవ భూములలో దెబ్బ తిన్న వ్యవసాయ భూములు పరిశీలించారు.