DEVOTIONAL

హిందువుల విశ్వాసానికి కేంద్రమైన శ్రీనాథ్‌జీ ఆలయంను దర్శించుకున్న ప్రధానిమోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మంత్రి ఒకరోజు రాజస్థాన్ పర్యటనలో బాగంగా రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..శ్రీనాథ్‌జీ ఆలయం హిందువుల విశ్వాసానికి కేంద్రం..మొఘల్ కాలంలో ఔరంగజేబు, హిందూ దేవాలయాలు, విగ్రహాలను ఏ స్థాయిలో ధ్వంసం చేశాడో అనేందుకు ఈ ఆలయంలోని శ్రీనాథ్‌జీ విగ్రహం సాక్షిగా నిలుస్తుంది.. ప్రస్తుతం కృష్ణుడు శ్రీనాథ్‌జీ ఆలయంలో చిన్ని కృష్ణుడి రూపంలో దర్శనమిస్తుంటాడు..తొలుత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనాథ్‌జీ ఆలయంలోని రాజ్‌భోగ్ బల్లను దర్శించుకున్నారు..అనతంతరం ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించి, దామోదర్‌ స్టేడియంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *