AMARAVATHIINTERNATIONAL

ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం

అమరావతి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను శుక్రవారం అందుకున్నారు.. భూటాన్ దేశ అత్యున్నత పౌర గౌరవాన్ని అందుకున్న మొదటి విదేశీ ప్రభుత్వాధినేత ప్రధాని మోదీ కావడం విశేషం..భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్ ప్రధాని మోదీని ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’తో సత్కరించారు..ఈ గౌరవానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ, ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు.. భూటన్ లోని థింపూలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ “ఈ గౌరవం నా వ్యక్తిగత విజయం కాదు, ఇది 140 కోట్ల మంది భారతీయుల గౌరవం…భూటాన్ భూటాన్‌లోని భారతీయులందరి తరపున ఈ గౌరవాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను… ఈ గౌరవానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’’ అని అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మార్చి 22న భూటాన్‌కు చేరుకున్నారు ప్రధాని మోదీ. భారతదేశం – భూటాన్‌ల మధ్య క్రమం తప్పకుండా ఉన్నత స్థాయి మార్పిడి సంప్రదాయానికి అనుగుణంగా ఈ పర్యటన కొనసాగుతోంది. పారో విమానాశ్రయంలో ప్రధానికి ప్రధాని షెరింగ్ టోబ్గే ఘనస్వాగతం పలికారు.

భూటాన్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన అతిథ్యం లభించింది. ఇంతకు ముందు ఏ భారత ప్రధానికి భూటాన్ రాజు ప్రైవేట్ విందు ఇవ్వలేదు..భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్, ప్రధాని మోదీకి ఈ ప్రత్యేక హోదాను కల్పించారు.. కె5 రెసిడెన్స్ లింగనా ప్యాలెస్‌లో భారత ప్రధానికి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.. అలాగే విదేశీ ప్రతినిధికి భూటాన్ అత్యున్నత పురస్కారం ఇవ్వడం సైతం ఇదే తొలిసారి..

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *