భారత వైమానిక దళంలోకి C-295 రవాణా విమానం ప్రవేశం
అమరావతి: భారత వైమానిక దళంలోకి మరో మధ్యశ్రేణి రవాణా విమానం C-295 హిండాన్ ఎయిర్ బేస్ లో సోమవారం భారత వైమానిక దళం (IAF)లో చేరింది..రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్,,హ్యాంగర్ లో ‘సర్వధర్మ పూజ’ కార్యక్రమం నిర్వహించారు..(IAF) ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, IAF అధికారులతో పాటు ఎయిర్ బస్ కు చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు..సెప్టెంబర్ 20న C-295 విమానం గుజరాత్ లోని వడోదరలో ల్యాండ్ కాగా సోమవారం పూజ కార్యక్రమాలు నిర్వహించారు..స్పెయిన్ లో ఈ విమానాలను వాయుసేనకు అప్పగించారు.. ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ అనే సంస్థతో ఈ విమానాల సేకరణకు రూ. 21,935 కోట్ల ఒప్పందం జరిగింది..గత సంవత్సరం అక్టోబర్ లో వడోదరలో C-295 విమానాల తయారీ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్ధాపన చేశారు..మొత్తం 56 C-295 రవాణా విమానాలకు గాను16 విమాలను ఎయిర్ బస్ కంపెనీ తయారు చేసి పంపిస్తుంది.. 40 విమానాలను, రెండు కంపెనీల మధ్య పారిశ్రామిక భాగస్వామ్యంలో భాగంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (TASL) తయారు చేసి అసెంబుల్ చేస్తుంది.. హైదరాబాద్ లో ఈ విమానాల విడిభాగాల ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది..ప్రైవేట్ కన్సార్టియం ఆధ్వర్యంలో భారత్ లో తయారయ్యే తొలి సైనిక విమాన ప్లాంట్ ఇదే.. C-295 అత్యాధునిక రవాణా విమానంగా పేరు వున్నది…ఈ విమానంలో 71 మంది సైనిక దళాలను, 50 పారాట్రూపర్లను చేరవేస్తుంది..పెద్ద రవాణా విమానాలు వెళ్లలేని ప్రాంతాలకు సైతం C-295 ఎయిర్ క్రాఫ్ట్లు యుద్ధసామాగ్రిని, సైనికులను సులభంగా తరలిస్తాయి.