AMARAVATHINATIONAL

ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంటుందా ? సుప్రీమ్ కోర్టు

అమరావతి: ఎల‌క్టోర‌ల్ బాండ్లపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువ‌రించింది. రాజకీయ పార్టీలు,,ఎన్నికలు,,పార్టీల నిర్వహణ కోసం ప్ర‌వేశ‌పెట్టిన ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంటుందా లేదా అన్న పిటీష‌న్ల‌పై సుప్రీమ్ కోర్టు గురువారం తీర్పును వెలువ‌రించింది..సీజేఐ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం  తీర్పును ఇస్తూ బ్లాక్ మ‌నీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు పోల్ బాండ్స్ స్కీమ్ ఒక్క‌టే ప‌రిష్కారం కాదు అని ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది.. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, బీఆర్ గ‌వాయి, జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రాలు ఆ ధ‌ర్మాస‌నంలో ఉన్నారు. ఎన్నిక‌ల బాండ్ల‌పై ఏక‌గ్రీవ తీర్పు ఇవ్వ‌నున్న‌ట్లు సీజేఐ వెల్ల‌డించారు.. ధ‌ర్మాస‌నంలోని స‌భ్యుల మ‌ద్య రెండు అభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి.. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నాతో పాటు తాను కూడా ఒకే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు సీజేఐ తెలిపారు.. స‌రైన ఓటింగ్ ప్ర‌క్రియ‌ను తెలుసుకునేందుకు రాజ‌కీయ నిధుల గురించి స‌మాచారం తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీజేఐ అన్నారు..ఆర్టిక‌ల్ 19(A)(A) ప్ర‌కారం స‌మాచార హ‌క్కు (RTA)ను ఉల్లంఘించిన‌ట్లు అవుతుందన్నారు..

ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్ రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని,,ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను జారీ చేసే బ్యాంకులు త‌క్ష‌ణ‌మే బాండ్ల‌ను నిలిపివేయాల‌ని కోర్టు త‌న తీర్పులో తెలిపింది.. నిధులు అందుకున్న రాజ‌కీయ పార్టీలు వివ‌రాల‌ను ఎస్‌బీఐ బ్యాంకు మార్చి 6వ తేదీలోగా ఎన్నిక‌ల సంఘానికి ఆ వివ‌రాల‌ను ఇవ్వాల్సి ఉంటుందని సూచించింది.. మార్చి 13వ తేదీ వ‌ర‌కు త‌మ అధికారిక వెబ్‌సైట్ ఎన్నిక‌ల సంఘం ఆ స‌మాచారాన్ని పోస్టు చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఎన్నిక‌ల బాండ్ల‌ను రాజ‌కీయ పార్టీలు ఖాతాలో జ‌మా చేయ‌కుంటే, వాటిని రిట‌ర్న్ చేయాల‌ని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌:- ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌ను జనవరి 2వ తేది 2018న కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది… ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీలు పారదర్శకత పద్ధతిలో నిధులు సేకరిస్తున్నాయి.. పథకానికి సంబంధించిన నిబంధనల ప్రకారం,, భారతదేశంలోని ఏ పౌరుడు లేదా స్థాపించబడిన సంస్థలు లేదా వ్యక్తిగతంగా లేదా కొంతమంది వ్యక్తుల సమూహం కలిసి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు సేకరించే వెసులుబాటు ఉంటుంది..అర్హత కలిగిన రాజకీయ పార్టీలు అధీకృత బ్యాంకు అకౌంట్ ద్వారా మాత్రమే విరాళాలను పొందాల్సి ఉంటుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *