AMARAVATHI

ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డలకు రక్షణ ఉందా ? పవన్ కళ్యాణ్

అమరావతి: వైసీపీ ముఖ్యమంత్రి తాడేపల్లిలో నివాసనికి సమీపంలో అంధ యువతి హత్యకు గురైన ఘటన తనను కలచివేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు..ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా? సీఎం నివాసం దగ్గరలో ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని ఆయన ప్రశ్నించారు..తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డగా మారిందని ఆరోపించారు..గతంలో జరిగిన రేప్ కేసులో ఒక నిందితుడిని ఇంకా పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. తన నివాసం పరిసరాల పరిస్థితులనే సమీక్షకుంటే ఎలా? అని పవన్ ప్రశ్నించారు..మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటేనన్నారు..కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు..దారుణ ఘటనలపై అన్ని వర్గాలూ ఆలోచన చేయాలని సూచించారు..తల్లి పెంపకంలోనే లోపం ఉందనే మంత్రులు గల ప్రభుత్వమిదని విమర్శించారు..దొంగతనానికి వచ్చి రేప్ చేశారనే మంత్రులు గల ప్రభుత్వమిదని విరుచుకుపడ్డారు.. అఘాయిత్యాలు సాగుతుంటే మహిళా కమిషన్ ఏం చేస్తోంది? అని పవన్ ప్రశ్నించారు..గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేశారని పేర్కొన్నారు..

గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో దారుణం జరిగింది..మద్యం మత్తులో అంధురాలైన ఓ యువతిని ఓ కిరాతకుడు అతి దారుణంగా నరికివేశాడు..ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అదే ప్రాంతానికి చెందిన రాజు అనే దుండగుడు కత్తితో దాడి చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు..తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతానికి చెందిన కుక్కుల రాజు అనే వ్యక్తి గంజాయి మత్తులో ఆదివారం రాత్రి ఒంటరిగా ఉన్న యువతి ఇంటికి వెళ్లి, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు..ఈ విషయం బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది..దీంతో తల్లిదండ్రులతో పాటు స్థానికులు కలిసి రాజును మందలించడంతో కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు..ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి యువతిపై కత్తితో దాడి చేసి నరికివేశాడు..నేరుగా రాజు,,డీఎస్పీ వద్దకు వెళ్లి లొంగిపోయాడు..రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైంది…శాంత్రిభద్రతల వైఫల్యం ఆడ,బిడ్డలపై అఘాయిత్యాలపై మహిళ సంఘాలు,మేధావులు,,న్యాయ నిపుణులు గళమెత్తాలి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *