నేను ఎంపీగా పోటీ చేస్తున్నా అనేది రూమర్ మాత్రమే-నాగబాబు
నెల్లూరు: జిల్లాలో మంత్రి కాకాణి గ్రానైట్ అక్రమ తవ్వకాలు ప్రొత్సహిస్తూండడంతో అయన అనుచరులు రెచ్చిపోతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శించారు..అదివారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకాణి అక్రమాలకు అధికారులు, పోలీస్ శాఖ వంతపాడుతున్నారని ఆరోపించారు..కావలి,,కోవూరులో ఎమ్మేల్యే అగాడలకు హద్దే లేకుండా పొతుందని మండిపడ్డారు..రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని,,వీటికి చరమగీతం పాడేందుకు టీడీపీ-జనసేన పొత్తు తొలి అడుగన్నారు..రానున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ అధికారానికి చేరువ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు..
“నాకు పదవులపై ఆసక్తి లేదు” ఎంపీగా పోటీ చేస్తున్నా అనేది రూమర్ మాత్రమే..జనసేన, టీడీపీల మధ్య పలు అంశాల్లో విబేధాలు ఉండొచ్చు…వాటిని మేం మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం…నెల్లూరులో జనసేనపార్టీ నుంచి మా అభ్యర్థి పోటీ చేస్తారన్నారు..నిజమైన నాయకుడు ప్రతిపక్షంలో ఉండకూడదు అనే ఆలోచన చేయడం ప్రజాస్వామ్యంకు మంచిదికాదన్నారు..2024లో జరిగే ఎన్నికల్లో మేం 150 స్థానాలు గెలవబోతున్నాం…వైసీపీ 20 నుంచి 25 సీట్లతో సరిపెట్టుకుంటుందంటూ వ్యాఖ్యనించారు.