AMARAVATHICRIME

విజయవాడ అర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం,3 మృతి

అమరావతి: విజయవాడలో సోమవారం ఉదయం 8.30 గంటల సమయలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. పండిట్ నెహ్రూ బస్టాండ్ లో 12వ నెంబర్ ఫ్లాట్ ఫాంపైకి బస్సు దూసుకుని వెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు..విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన మెట్రో లగ్జరీ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఫ్లాట్ ఫాంపైకి దూసుకు వెళ్లిందని బస్టాండ్ లో వున్న ప్రయాణికులు తెలిపారు..మృతుల్లో డ్యూటీలోకి వెళ్లెందుకు వేచి చూస్తున్నా బుకింగ్ క్లర్క్ వీరయ్య,,కుమారి అనే మహిళ, 10 నెలల చిన్నారి అయున్ష్ ఉన్నారు.. డ్రైవర్,బస్సును వెనక్కు తీసేందుకు రివర్స్ గేర్ కు బదులుగా ఫస్ట్ గేర్ వేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుని వుంటుందని బస్టాండ్ లో బస్సుకోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు తెలిపారు..లేక బ్రేక్ ఫెయిల్ అయిందా ? అన్న విషయం ఎవరికీ అర్థం కావడంలేదు..బస్సు డిపో నుంచి బయటకు వచ్చినప్పుడు ఫిట్ నెస్ పరిశీలించిన తర్వాతే బస్సు కాంప్లెక్స్ కు తీసుకువస్తారు..అయితే బ్రేక్ ఫెయిల్ కావడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..
ఎం.డీ ద్వారాక.తిరుమలరావు:- ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని,,ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా క్రింద రూ.5 లక్షలు అందచేయనున్నట్లు తెలిపారు.జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నమని,,నివేదిక అందిన తరువాత చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *