AMARAVATHIHYDERABAD

కేసీఆర్ కాలు జారి కింద పడడంతో తీవ్ర గాయం

హైదరాబాద్: కే.సి.ఆర్ తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగినట్లు సమాచారం..ఈ ప్రమాదంలో ఆయన కాలు ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు.. అలాగే ఈ ప్రమాదంతో గతంలో విరిగిన కాలు గాయం మరోసారి తిరగబడిందని వైద్యులు తెలిపారు. వెంటనే ఆయనను యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు…
ఈ విషయమై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు స్వల్ప గాయం కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో నిపుణుల సంరక్షణలో ఉన్నారు.. ప్రజల మద్దతు, శుభాకాంక్షలు వెల్లువెత్తడంతో నాన్న త్వరలో పూర్తిగా కోలుకోనున్నారు. అందరి ప్రేమకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రాత్రి ఫాంహౌజ్ లో జారి పడ్డారన్న విషయం తెలిసి తాను చాలా బాధపడ్డానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ‘‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం వుండాలని ప్రార్థిస్తున్నాను’’ అని పోస్ట్ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *