ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత,15 రోజులు తీహార్ జైలుకు
ఈడీనా ? బోడీనా ? కవిత…
అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది..ఏప్రిల్ 1వ తేదిన కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణ జరపనుంది.. సోమవారంతో కవిత ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో,,ఆమెను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు.. తన కుమారుడి పరీక్షలు రాస్తూన్నందున,, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు లాయర్ కోరారు.. కవితను 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఈడీ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు..ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం,, కవితకు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.. కవిత కస్టడీ రిపోర్ట్ లో ఈడీ కీలక అంశాలను ప్రస్తావిస్తూ,, కవిత అత్యంత ప్రభావవంతమైన నాయకురాలని,,ఈ కేసులో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది.. భవిష్యత్ లో విచారణకు ఆటంకం కలిగే అవకాశముందని పేర్కొంది.. లిక్కర్ కేసు విచారణలో కవితను కిన్ పింగ్ గా గుర్తించామని,,ఈ వ్యవహారంలో కవిత కీలకమైన కుట్రదారు, లబ్ధిదారు అని ఈడీ కోర్టుకు తెలియ చేసింది..కవిత పాత్రపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉన్నందునా 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్దించారు..