AMARAVATHIINTERNATIONAL

పాక్‌లోని రెండో అతిపెద్ద నేవీ ఎయిర్‌స్టేషన్‌పై తిరుగుబాటుదారులు దాడి

అమరావతి: ఉగ్రవాదుల ఫ్యాక్టరీ అయిన పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు పాక్‌లోని రెండో అతిపెద్ద నేవీ ఎయిర్‌స్టేషన్‌ (PNS సిద్ధిఖ్‌)పై సోమవారం రాత్రి దాడి చేశారు..పలువురు తిరుగుబాటుదారులు తుపాకులు,, బాంబులతో నావల్‌ ఎయిర్‌స్టేషన్‌ స్థావరంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు..వెంటనే అప్రమత్తమైన సైనికులు, పోలీసులు ఎదురుకాల్పులు జరిపి నలుగురు తీవ్రవాదులను హతమార్చారు..ఎయిర్‌స్టేషన్‌కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు..బాలూచిస్థాన్‌లో ఉన్న ఈ స్థావరంలో చైనాకు చెందిన డ్రోన్లను పెద్ద ఎత్తున మోహరించినట్లు తెలుస్తొంది.. ఈ ఘటనకు పాకిస్తాన్ నిషేధిత ‘బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ’ బాధ్యత వహిస్తూ,, ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది..తమ యోధులు జరిపిన కాల్పుల్లో 12 మందికి పైగా పాకిస్థానీ బలగాలు మరణించినట్లు తెలిపింది..ఈ విషయంపై పాకిస్థాన్‌ సైన్యం ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు.. వారం రోజుల వ్యవధిలోనే తిరుగుబాటుదారులు ఈ తరహా దాడికి యత్నించడం ఇది రెండోసారి..మార్చి 20వ తేదిన గ్వాదర్‌ పోర్టుపైనా తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *