AMARAVATHICRIMEHYDERABAD

మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్లి, మృత్యువాత పడ్డ తల్లి,కూతుళ్లు

హైదరాబాద్: మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్లిన తల్లికూతుళ్లు డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగా మృత్యువాత పడ్డారు..ఈ విషాద సంఘటన హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది..నగరం శివార్లలోని బండ్లగూడ జాగిర్‌లో ఎప్పటిలాగే ఉదయం అనురాధ (58), మమత (26) రోడ్డుపై మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లారు..అతి వేగంగా వచ్చిన కారు వారితో పాటు మరో ఇద్దరిని వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది..వేగంగా అదుపుకాకపోవడంతో పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొట్టింది..ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్‌ చేస్తున్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు..ఈ సంఘటనలో అనురాధ,,మమత అక్కడికక్కడే మృతి చెందగా కవిత అనే మరో మహిళ,, ఇంతిఖాబ్ ఆలం అనే వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయి..సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాలను స్వాధీనం చేసుకుని,,గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుత్రికి తరలించారు..పోలీసులు కారు నెంబర్ ఆధారంగా వాహనం నడిపిన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు దర్యప్తు చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *