తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేశారు..తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు..అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు.. లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేస్తారని సమాచారం..చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకూడి నుంచి బీజేపీ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తొంది..2014 నుంచి 2019, సెప్టెంబర్ వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు..2019 సెప్టెంబర్ 8న తెలంగాణకు గవర్నర్గా తమిళిసై నియమితులయ్యారు..2019 పార్లమెంట్ ఎన్నికల్లో తూత్తుకుడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.