నితీశ్ కుమార్ రాజీనామా-INDIA కూటమి బలహీన పడింది-నితీశ్
అమరావతి: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం ఉదయం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కు తన రాజీనామా లేఖను సమర్పించారు.. రాష్ట్రంలో తాము మహాకూటమితో పొత్తును విరమించుకుంటున్నట్లు గవర్నర్ కు తెలిపారు..నితీశ్ రాజీనామాకు గవర్నర్ అర్లేకర్ ఆమోదం తెలిపారు.. కొత్త ప్రభుత్వం కొలువుదీరేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు.. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్ బీజేపీతో కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది..ఇదే సమయంలో బీజేపీ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు మరో ప్రచారం సాగుతోంది..ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే మరి కొన్ని గంటల్లో తెలిసిపోనున్నది.. రాజీనామా లేఖ ఇచ్చిన అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను గవర్నర్ ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేశానని,, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరానని తెలిపారు.. దేశంలో INDIA కూటమి బలహీన పడిందని వ్యాఖ్యానించారు.