యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’-కాకాణి
నెల్లూరుర: గ్రామ స్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, వారిలోని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర వ్యవసాయ, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.నెల్లూరు ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో మంగళవారం “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమాన్నిమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగి ఉండి మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోతున్నక్రీడాకారులను గుర్తించి వారిలో క్రీడలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో గ్రామ స్థాయి నుండి మండల, నియోజక వర్గ, జిల్లా,రాష్ట్ర స్థాయిలో ఆడుదాం ఆంధ్రా వంటి వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమంలో రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయి క్రీడా విజేతలను పరిచయం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.