AMARAVATHINATIONAL

జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలో సర్వేపై “ స్టే “కు నిరాకరించిన సుప్రీం

అమరావతి: జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సర్వేను నిలుపదల చేయాలంటూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వేసిన వ్యాజ్యంపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించింది.. తవ్వకాలు లేకుండా, నిర్మాణానికి నష్టం వాటిల్లకుండా మొత్తం సర్వేను పూర్తి చేస్తామని ASI స్పష్టం చేసినట్లు ధర్మాసనం తెలియజేసింది..జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ASI సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు అదేశాలు ఇచ్చింది.. ASI శాస్త్రీయ సర్వేను నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వలేమని దేశ అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది..ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నిపుణులు శుక్రవారం ఉదయం నుంచే ఈ సర్వేను ప్రారంభించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *