AMARAVATHI

49 మంది విశాఖ మత్సకారులకు రూ.50 వేలు చొప్పున నగదు అందించిన పవన్

అమరావతి: దండుపాళ్యం బ్యాచ్ లా వైసీపీ రౌడీ మూకలు తయారయ్యారు.. మనం అధికారంలోకి వచ్చాక ఇక్కడ మెరైన్ పోలీసింగ్ ఏర్పాటు చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ మత్సకారులకు భరోసా ఇచ్చారు..శుక్రవారం ఫిషింగ్ హార్బర్య లో అగ్ని ప్రమాద ఘటనలో బోట్లు నష్టపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున 49 మందికి పవన్ కల్యాణ్ చెక్కులు పంపిణీ చేశారు..తాను ఇచ్చే డబ్బు కష్టాలు, తీరుస్తుందని తాను నమ్మనని, కష్టాలు వస్తే జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నాడనే బావన, కష్టాల్లో బతకనిస్తుందని పవన్ చెప్పారు.. మత్స్యకారులను తాను ఏ రోజు ఓటు బ్యాంక్ తో చూడలేదు,,కష్టాల్లో తమ వెంట నిలబడతానని చెప్పడం కోసం వచ్చానని తెలిపారు.. సుమారుగా 25 కోట్ల మేర నష్టం జరిగిందని, పరిమితి వలన న్యాయం చేయలేకపోతున్నానని, ప్రతి మత్స్యకారుడికీ అండగా ఉంటానని జనసేనాని స్పష్టం చేశారు.. ఖండ బలం, గుండె బలం ఉండాలో మత్స్యకారుని చూసే నేర్చుకోవాలన్నారు.. గత కొంతకాలంగా చీకటి గ్యాంగ్స్ ఎక్కువయ్యాయని, మత్స్యకారులను భయపెడుతున్నారని విమర్శించారు..”వైసీపీ వలన రౌడీ మూకల రాజ్యమేలుతున్నాయి,, నాలుగు నెలలు భరిద్దాం,,, విశాఖలో భద్రతతో కూడిన హార్బర్ ని తీసుకొచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు.. వైసీపీని ఎదుర్కోవాలంటే బలం కావాలి… అవకాశాల్ని, వదులుకోకూడదని, టీడీపీతో కలిసి వెళుతున్నామన్నారు.. వైసీపీ వస్తే మళ్ళీ ఇలాంటి పరిస్థితులు దాపురిస్తాయని చెప్పారు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఇస్తూ, ఎందుకు ప్రభుత్వాల దగ్గర దేహి అనాలి? గుజరాత్, కేరళ తరహాలో మన జట్టిలు మనమే నిర్మించుకుందామన్నారు.. సాగర్ మాల ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం 150 కోట్లు కేటాయిస్తే ఇప్పటికీ లైట్లు వెలిగించలేకపోయారని మండిపడ్డారు..”వైసీపీ కావాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి..మత్స్యకార ప్రాజెక్టులు కేంద్రం ఇస్తుంది..రూ.400 కోట్లు పెడితే జట్టి పూర్తవుతుంది.. రూ.451 కోట్లు పెట్టి రుషికొండ మీద నిర్మాణలు చేట్టారు.. జగన్ విలాసాలకు పెట్టకుండా, జట్టికి పెడితే 10,000 కుటుంబాలు బాగుపడేవన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *