డాక్టరేట్ ను సున్నితంగా తిరస్కరించిన పవన్ కళ్యాణ్
అమరావతి: జనసేనపార్టీ అధ్యక్షడు, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డాక్టరేట్ ను సున్నితంగా తిరస్కరించారు.. తమిళనాడు రాష్ట్రంలోని వేల్స్ యూనివర్సిటీ,తమ 14వ స్నాతకోత్సవానికి పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తూ,,డాక్టరేట్ స్వీకరించాలని సదరు యూనివర్సిటీ కోరింది..ఇందుకు పవన్ కల్యాణ్ డాక్టరేట్ ను తిరస్కరిస్తూ యూనివర్సిటీకి లేఖ రాశారు..యూనివర్సిటీ స్నాతకోత్సవానికి రాలేనని,,సమాజంలో తనకన్నా గొప్ప వ్యక్తులు ఉన్నారని,,అలాంటి వారికి డాక్టరేట్ ఇవ్వాలని సూచించారు.. పవన్ కల్యాణ్ చేసిన సహాయ, సేవా కార్యక్రమాలను మెచ్చి వేల్స్ యూనివర్సిటీ, డాక్టరేట్ ప్రకటించినట్టు సమాచారం..