AMARAVATHINATIONAL

70 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందచేసిన ప్రధాని మోడీ

అమరావతి: దేశంలోని 70 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాని మోడీ పంపణీ చేశారు..మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా రోజ్ గార్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు.. అపాయింట్ మెంట్ లెటర్స్ అందుకున్న యువకులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశంను అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు..వచ్చే ఏడాదిన్నరలో రోజ్ గార్ మేళాల ద్వారా 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని గత సంవత్సరం ప్రధాని ప్రకటించారు..ఇందులో బాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వివిధ శాఖల్లో ఈ ఉపాధి మేళా క్రింద నియామకాలు జరుగుతున్నాయి..కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 43 చోట్ల ఉపాధి మేళాలు నిర్వహిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *