జర్నలిస్టుల సమస్యల పరిష్కారంకు నా వంతు ప్రయత్నం తప్పక చేస్తా-కాకాణి
నెల్లూరు: సమాజంలోని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తున్న జర్నలిస్టులకు వున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానాని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డి చెప్పారు..గురువారం స్థానిక రెడ్ క్రాస్ కార్యలయంలో APUWJ (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు) ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జర్నలిస్టులు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సందర్బంలో మంత్రి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి,,నెల్లూరు జిల్లా ప్రింట్ మీడియా అధ్యక్షడు వెంకటేశ్వర్లు,,ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.