ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం
అమరావతి: దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో 10 సెకన్ల పాటు భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు..ఢిల్లీ, జమ్మూకశ్మీర్, చండీగఢ్, పంజాబ్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.. శ్రీనగర్ లో భారీ ప్రకంపనలు వచ్చాయని,,అలాగే జమ్మూలోని దోడా జిల్లాలోని గండోహ్ భలెస్సా గ్రామ సమీపంలో 5.7 తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు..జమ్మూ,,ఢిల్లీ-NCR, హిమాచల్ ప్రదేశ్ పలుచోట్ల రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4 నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) పేర్కొంది..దోడాలోని గందోభలేసా గ్రామానికి 18 కి.మీల దూరంలో,,భూమి ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు NCS తెలిపింది..భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు భయంతో ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు..భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి,ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.